19 April, 2026 | 1:34 AM

సెమీస్‌లో లక్ష్యసేన్

28-12-2024 01:03 AM

షెంజెన్ (చైనా): కింగ్ కప్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ ఓపెన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ సెమీస్‌కు దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో లక్ష్యసేన్ 10 21 21 హాంగ్ కాంగ్‌కు చెందిన అంగస్ లాంగ్‌ను ఓడించాడు. గేమ్‌ను మెళ్లిగా ప్రారంభించిన లక్ష్యసేన్ ఆ తర్వాత క్రమంగా గేమ్‌పై పట్టు సాధించాడు. మాజీ చాంపియన్ లోహ్ కి యాన్, అలెక్స్ లేనియర్‌తో పాటు చైనాకు చెందిన  హు జి, వాంగ్ జి పోటీలో ఉన్నారు.