calender_icon.png 28 June, 2025 | 5:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఢిల్లీలో మూడ్రోజుల పాటు లాల్ దర్వాజా బోనాలు

28-06-2025 02:26:01 PM

హైదరాబాద్: దేశ రాజధాని ఢిల్లీలో మూడు రోజుల పాటు లాల్ దర్వాజా బోనాలు(Lal Darwaza Bonalu Festival) నిర్వహించనున్నారు. ఈ నెల 30 నుంచి జులై 2 వరకు సింహవాహిని మహంకాళి అమ్మవారి ఉత్సవాలు చేపట్టనున్నారు. తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) సహకారంతో ఢిల్లీలో ఘనంగా ఉత్సవాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈనెల 30న తెలంగాణ భవన్ లో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయనున్నారు. జులై 1న ఇండియా గేట్(India Gate) నుంచి తెలంగాణ భవన్ వరకు అమ్మవారి ఊరేగింపు కొనసాగనుంది. జులై 2న పోతురాజు, కళాకారుల నృత్యాలు చేపట్టనున్నారు. ఇప్పటి అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.