calender_icon.png 25 June, 2025 | 2:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెద్దపల్లి ఎంపీ, మంత్రి అండతో భూమి కబ్జా..

24-06-2025 07:58:13 PM

ప్రజావాణీలో ఫిర్యాదు చేసిన సోషల్​ వర్కర్​..

పెద్దపల్లి (విజయక్రాంతి): పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ(MP Vamsi Krishna), మంత్రి వివేక్​ వెంకటస్వామి(Minister Vivek Venkataswamy) అండదండలతో పెద్దపల్లి మండలం తుర్కల మద్దికుంట మాజీ సర్పంచ్​ సయ్యద్​ సజ్జాద్, ​పెద్దపల్లి శివారులోని 1698 సర్వే నంబర్​లో 8 గుంటల భూమిని కబ్జా చేసాడని పెద్దపల్లికి చెందిన సోషల్​ వర్కర్​ ఎంఎ రహమాన్​(షాకీర్​) ప్రజావాణీలో కలెక్టర్​కు ఫిర్యాదు చేశాడు. అలాగే రహమాన్​ సోషల్​ మీడియాలో వీడియోను విడుదల చేశాడు. సయ్యద్​ సజ్జాద్​ అనే వ్యక్తి మంత్రి గడ్డం వివేక్​ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ అనుచరుడుగా చెప్పుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు.

పెద్దపల్లి శివారులోని 1698 సర్వే నంబర్​లో ఉన్న 8 గుంటల భూమి కబ్జా చేసి ఆ భూమిని వెంచర్​ చేసి తన అనుచరులతో కలిసి అమ్మకాలు చేస్తున్నాడు. అలాగే 1699 సర్వే నంబర్​లోని ప్రభుత్వ భూమిలో ఉన్న చెరువు నాలాను కూడా మట్టితో పూడ్చివేసి రోడ్డు వేసుకున్నాడని పేర్కొన్నాడు. తనకు ఎంపీ, మంత్రి అండదండలున్నాయనే, తన అనుచరులతో కలిసి బెదిరింపులకు పాల్పడుతున్నాడని రహమాన్​ తన వీడియోలో పేర్కొన్నాడు. అక్రమాలకు పాల్పడుతున్న సయ్యద్​ సజ్జాద్​పై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు కబ్జాకు గురైన భూమిని ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలని కోరాడు.