04-06-2025 12:09:30 AM
మేడ్చల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ విజయేందర్ రెడ్డి
ఘట్ కేసర్, జూన్ 3 (విజయక్రాంతి) : భూపరమైన సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన భూ భారతి ద్వారా పరిష్కారం చేయడం జరుగుతుందని మేడ్చల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ విజయేందర్ రెడ్డి అన్నారు.
ఘట్కేసర్ పట్టణం లోని తహసిల్దార్ కార్యాలయం ఆవరణలో అలాగే మున్సిపల్ పరిధిలోని ఎదులబాద్ లో అడిషనల్ కలెక్టర్ విజ యేందర్ రెడ్డి అధ్యక్షతన భూ భారతి రెవిన్యూ సదస్సులు నిర్వహించారు. భూ భారతి రెవిన్యూ సదస్సులలో టీపీసీసీ ఉపాధ్యక్షులు, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జి తోటకూర వజ్రేష్ యాదవ్, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ మల్లిపెద్ది శరత్ చంద్రారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ ముల్లి పావని జంగయ్యయాదవ్, సొసైటీ చైర్మన్ సింగిరెడ్డి రామిరెడ్డి, పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూపరమైన సమస్యలు భూ భారతి ద్వారా పరిష్కారం చేయడం జరుగుతుందన్నారు. భూమి అంటే ఆత్మగౌరవమని, ఆభూమి సమస్యల్లో అంటే పంచాయతీల్లో ఉంటే ఇబ్బందులు కలుగుతాయి అన్నారు. గ్రా మాల్లో ప్రధాన సమస్య ధరణి లో మా పేరు తప్పుగా పడింది ఆ సమస్య పరిష్కారం చేయాలని మాకు వినతులు వస్తుండేవనీ దీంతో సీఎం రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు ధరణి స్థానంలో భూ భారతి తీసుకొస్తామని హామీ చిన్న మాటను గుర్తు చేశారు.
ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూ సమస్యల పరిష్కారానికి భూ భారతి తెచ్చారనీ, మనకి ఆదార్ కార్డు ఉంది, ఇప్పుడు భూ యజమానికి భూధార్ కార్డు వస్తుందన్నారు. భూనక్ష భూహక్కులు మీకు కల్పిస్తున్నట్లు తెలియజేశారు. అందులో భాగంగానేభూభారతి చట్టంపై అవగాహన కల్పిస్తున్నాం అన్నారు. రెవెన్యూ పరమైన సమస్యలు రెవిన్యూ అధికారుల దృష్టికి తీసుకోవచ్చి పరిష్కారం చేసుకొని రాష్ట్రంలో రెవెన్యూ సమస్యలు లేని పేరు తెచ్చుకుందాం అని ప్రజలకు సూచించడం జరిగింది.
ఈకార్యక్రమంలో తహసిల్దార్ రజని, మేడ్చల్ నియోజకవర్గం బిబ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షులు మామిడ్ల ముత్యాలు యాదవ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొక్క సంజీవరెడ్డి, మాజీ కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.