calender_icon.png 27 June, 2025 | 3:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీచర్ల సర్దుబాటు ఉత్తర్వులను జూలై 31 తర్వాత అమలు చేయాలి

04-06-2025 12:09:59 AM

తపస్ వినతి

హైదరాబాద్, జూన్ 3 (విజయక్రాంతి): టీచర్ల సర్దుబాటు ఉత్తర్వు లను జూలై 31 తర్వాత అమలు చేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) ప్రభుత్వా న్ని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మం గళవారం విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణాను ఆ సంఘం అధ్య క్ష, ప్రధానకార్యదర్శులు హన్మంత్‌రావు, నవాత్ సురేష్ కలిసి వినతి పత్రం అందజేశారు.

ప్రతి పాఠశాలకు తరగతికి ఒక టీచర్‌ను సర్దుబా టు చేయాలని, సాంఘిక శా స్త్రంలో పోస్టుల కేటాయింపులో 340 విద్యార్థుల వరకు ఒక పోస్టు ను కేటాయించడం సరైనది కాదని వివరించారు. 221 తర్వాత రెండవ పోస్ట్ కేటాయించాలని వారు కోరారు.