calender_icon.png 13 June, 2025 | 10:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూ సమస్యలు భూభారతి చట్టం ద్వారా పరిష్కారం

13-06-2025 01:07:45 AM

అదనపు కలెక్టర్ వీరారెడ్డి 

యాదాద్రి భువనగిరి జూన్ 12 ( విజయ క్రాంతి )భూ సమస్యలు ఉన్నవారు గ్రామ రెవెన్యూ సదస్సులో దరఖాస్తు చేసుకుంటే భూ భారతి చట్టం ద్వారా భూ శాశ్వత పరిష్కారం అవుతుందని రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి అన్నా రు.గురువారం రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో బొమ్మలరామా రం మండలంలోని తిమ్మాపు రం గ్రామంలో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులో రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ... ధరణి ద్వారా కానీ భూ సమ స్యలకు ప్రభుత్వం కొత్తగా భూభారతి (ఆర్ ఓ ఆర్ చట్టం) అమలులో భాగంగా రెవిన్యూ అధికారులే మీ గ్రామానికి వచ్చి భూ సమస్యలు పరిష్కరిస్తారు. గ్రామంలోని రైతులను వారి భూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమ సమస్యలను తెలియజేసి పరిష్కరించుకోవాలన్నారు.

రిజిస్ట్రేషన్, మార్పులు చేర్పులు, ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే మీ గ్రామంలోనే మీ ఇంటి దగ్గరకే వచ్చి రెవెన్యూ అధికారులు సమస్య పరిష్కరిస్తారన్నారు.భూ భారతి లో దరఖాస్తు పెట్టుకుంటే, రైతులు అర్జీతోపాటు పాస్ పుస్తకం, సమస్యలకు సంబంధించిన ఆధారాలను అధికా రులకు అందజేయాలని, అందజేసిన రోజే రెవెన్యూ అధికారులు మీ గ్రామంలోనే పరిశీలించి ,కోర్టు పరిధిలో ఉన్న ఆర్జీల మినహా మిగతా వాటిని పరిష్కరిస్తారన్నారు.

సమస్య యొక్క దరఖాస్తులను రెవెన్యూ అధికారులు పరిశీలించి సమస్యలు పరిష్కరిస్తారన్నారు.తీసుకున్న అర్జీలను అదే రోజు గ్రామంలో పరిశీలించి అవసరం అయితే క్షేత్రస్థాయిలో విచారిస్తారన్నారు. భూ భారతి సేవలు గ్రామంలో రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. సదస్సులలో సంబంధిత అధికారులు, గ్రామ రైతులు పాల్గొన్నారు.