13-06-2025 01:09:10 AM
జిల్లా గ్రంథాలయం చైర్మన్ వంగవీటి రామారావు
కోదాడ, జూన్ 12: జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల కోదాడ యందు గురువారం పాఠశాల పున ప్రారంభం సందర్భంగా విద్యార్థులకు ప్రభుత్వం చేత అందించే ఉచిత పుస్తకాలు, దుస్తుల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యఅతిథిగా సూర్యాపేట జిల్లా గ్రంథాలయం చైర్మన్ వంగవీటి రామారావు పాల్గొని మాట్లాడినారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు మార్కండేయ సీనియర్ ఉపాధ్యాయురాలు మీనాక్షిపాల్గొన్నారు.