01-06-2025 06:38:56 PM
మందమర్రి (విజయక్రాంతి): లెదర్ పార్క్ సాధన సమితి ఆధ్వర్యంలో లెదర్ ఇండస్ట్రియల్ పార్క్(Leather Industrial Park) పట్టణ జేఏసీ, మంచిర్యాల జిల్లా జేఏసీ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని లెదర్ పార్క్ సాధన, చర్మకార ఉత్పత్తిదారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కొలుగురి విజయ్ కుమార్ తెలిపారు. పట్టణంలోని సింగరేణి హై స్కూల్ గ్రౌండ్(Singareni High School Ground) లో ఆదివారం నిర్వహించిన సమావేశంలో జేఏసీ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆయన వివరించారు.
పట్టణ జేఏసీ కన్వీనర్ గా నెరువట్ల శ్రీనివాస్, కో కన్వీనర్లు గా మంతెన సుమన్, ముల్కల రమేష్, కె రామకృష్ణ, నందిపేట రాజు, నెరవేట్ల సుజిత్, గడ్డం అనిల్, కోలుగురి పృథ్వీరాజ్, బత్తుల సరిత, బొడ్డు వినోద, సకినాల సాయి కృష్ణ, ఎంవి గుణ, కాసిపేట స్వామి, తోకల నిరోష, జేఏసీ గౌరవ అధ్యక్షులుగా ఉప్పులేటి నరేష్ లను ఎన్నుకున్నట్లు తెలిపారు.
అలాగే మంచిర్యాల జిల్లా జేఏసీ గౌరవ అధ్యక్షులుగా పుల్లూరి లక్ష్మణ్, కన్వీనర్ గా చిప్పకుర్తి ఐలయ్య, జంగంపల్లి రామస్వామి, పల్లె సమ్మయ్య, నందిపేట రవి, దరిపల్లి కనకయ్య, సిర్ర దివాకర్, నేరెళ్ల శంకరయ్య, ఎలుకపెళ్లి మల్లేష్, సుద్దాల జనార్ధన్, ఆసంపల్లి రాయమల్లు, బచ్చలి నర్సయ్య, వేల్పుల కిరణ్, చిలుముల కుమార్, మామిడిపల్లి ప్రకాష్, కొంకటి శ్రీనివాస్, కాసిపేట స్వామి లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నామన్నారు. జిల్లా జేఏసీ పట్టణ జేఏసీ ఆధ్వర్యంలో లెదర్ పార్క్ ఏర్పాటుతో పాటు ఉత్పత్తి సాధించేవరకు కృషి చేస్తామన్నారు. ఎంపీ ఎమ్మెల్యేలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులు విడుదల చేయించి పట్టణ మనుగడకు, చర్మకారులతో పాటు స్థానిక యువతకు ఉపాధి కల్పించేలా ప్రజాప్రతినిధులు కృషి చేయాలని కోరారు.