01-06-2025 06:35:12 PM
విడుదల చేసిన జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లాడి పౌల్ రాజ్..
భద్రాచలం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలోని ఏఎంసీ కాలనీలో మాల మహానాడు ముఖ్య కార్యకర్తల సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాలల ఆత్మీయ సమ్మేళనం కరపత్రాలు విడుదల చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాల మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లాడి పౌల్ రాజ్(Alladi Paul Raj) మాట్లాడుతూ.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ కమిటీల సభ్యులు, మాల మేధావులు, మాల ఉద్యోగులు, మాల విద్యార్థులు, మాల మహిళ మణులు, మాల యువకులు, మాల రిటైర్డ్ ఉద్యోగస్తులు, మాల ప్రైవేటు ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరూ ఐక్యతతో మాలల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దాసరి శాంతయ్య, ప్రభాకర్, మంజు, హుస్సేన్, శ్యాము, నాని, కార్తీక్, టింకు, మేరీ, సుత్తి సుధారాణి, తదితరులు పాల్గొన్నారు.