గంజాయి రహిత జిల్లాగా మారుద్దాం..
28-04-2026 01:05 AM
నిర్మల్, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో గంజాయి నిర్మూలన జిల్లాగా మార్చేందు కు కృషి చేస్తున్నట్టు ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల తెలిపారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో గాంజా బస్తి బ్యానర్లను పోస్టర్లను ఆవిష్కరించారు. నిర్మల్ జిల్లాలో పోలీస్ శాఖ మత్తు పదార్థాలు నియంత్రణపై దృష్టి పెట్టి తనిఖీలు నిర్వహించి గంజాయి ఇతర మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్న వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు.






