calender_icon.png 21 June, 2025 | 6:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్చకుల జీవితాల్లో వెలుగులు

21-06-2025 02:10:11 AM

  1. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రత్యేక చొరవ
  2. --  18 మంది ఉద్యోగులకు గ్యాట్యూటీ, మెడికల్ సాయం చెల్లింపు
  3. అర్చక సంక్షేమ నిధి ట్రస్టు ద్వారా సాయం
  4. రూ.32 లక్షల చెక్కును అందజేసిన మంత్రి
  5. రిటైర్ అయిన ఉద్యోగులకు సన్మానం

హైదరాబాద్, జూన్ 20 (విజయక్రాంతి): దేవాదాయ శాఖలో సంవత్సరాల తరబడి పని చేస్తున్న అర్చకులు, ఉద్యోగుల జీవితాల్లో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వెలుగులు నింపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో పని చేస్తున్న అర్చకుల దీర్ఘకాలిక కోరికను నెరవేర్చారు. అన్ని ఆలయాల్లో సుదీర్ఘ కాలంగా సేవలు అందిస్తున్న అర్చక, ఉద్యోగుల సంక్షేమ నిమిత్తం ప్రత్యేకంగా నిధిని ఏర్పాటు చేశారు.

దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఎండోమెంటు డైరెక్టర్ వెంకటరావు, సంబంధిత అధికారులతో కలిసి రూ.32 లక్షల విలువైన చెక్కును అర్చక, ఉద్యోగ సంక్షేమ నిధి ద్వారా అందజేశారు. 18 మంది ఉద్యోగులకు గ్యాట్యూటీ, మెడికల్ సాయం అందజేశారు. వారికి ఆర్డర్ కాపీలు కూడా అందజేశారు. అనంతరం రిటైర్ అయిన ఉద్యోగులను మంత్రి ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ.. అర్చక, ఉద్యోగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని వివరించారు. ఈ సంక్షేమ ట్రస్టు ద్వారా దేవాదాయ శాఖ పరిధిలో సహాయ కమిషనర్ స్థాయి వరకు గల సుమారు 13,700 మంది అర్చకులు, ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. అర్చకులు, ఉద్యోగులకు మరణానంతరం లేదా రిటైర్మెంట్ తర్వాత గ్రాట్యూటి ఇస్తామని వెల్లడించారు.

ధూపదీప నైవేద్య అర్చకులకు మరణానంతరం చెల్లించే గ్రాట్యూటీని నిర్ధారించినట్టు పేర్కొన్నారు. మరణానంతరం చెల్లించే ఎక్స్‌గ్రేషియా, అంతిమ సంస్కారాల ఖర్చుల నిమిత్తం ఈ నిధి ఉపయోగపడుతుందన్నారు. ఈ నిధి కింద ఉద్యోగులకు మెడికల్ రీయింబర్స్‌మెంట్, వివాహానికి, ఉపనయనానికి, గృహ నిర్మాణ, కొనుగోలు, మరమ్మతులకు, విద్యా అవసరాలకు, విధులు నిర్వహించలేని దివ్యాంగులైన ఉద్యోగులకు ఆర్థిక సహాయం అందజేయనున్నట్టు పేర్కొన్నారు.

మంత్రి సురేఖకు రుణపడి ఉంటాం: అర్చక, ఉద్యోగులు

ఏండ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సమస్యల ను తీర్చినందుకు మంత్రి కొండా సురేఖకు అర్చక, ఉద్యోగులు ధన్యవాదాలు తెలిపారు. మంత్రికి రుణపడి ఉంటామని పేర్కొన్నారు. వివిథ పథకాల్లో రెగ్యులర్ అర్చకులు, ఇతర ఉ ద్యోగులకు మరణానంతరం లేదా రిటైర్మెంట్ గ్రాట్యూటీ పథకానికి గత నెల 28న అర్చక సంక్షేమ బోర్డు ద్వారా గ్రాట్యుటీ రూ 4 లక్షల నుంచి రూ8 లక్షలకు పెంచడం హర్షణీయమన్నారు.

ఈ గ్రాట్యుటీ మొత్తాన్ని సదరు ఉద్యోగి బ్యాంకు ఖాతాలో ఏక మొత్తంలో వారి సర్వీ సు కాలానికి లోబడి చెల్లించడం సంతోషకరమన్నారు. ఎవరైనా అకాలంగా చనిపోతే అం తిమ సంస్కారాల కోసం  అందించే సాయాన్ని రూ.20వేల నుంచి రూ.30 వేలకు పెంచడం ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు.

సాయం పొందిన వారి వివరాలు..

మంత్రి కొండా సురేఖ నుంచి గ్యాట్యూటీ, మెడికల్ సాయం పొందిన వారిలో తానేశ్ (నిజామాబాద్) రూ.లక్ష (మెడికల్) పీ లక్ష్మణమూర్తి(సిద్దిపేట) రూ. ౨లక్షలు (మెడికల్), పీ రామారావు(మెదక్) రూ.లక్ష (మెడికల్), బీ సంతోశ్(మెదక్) రూ. లక్ష(మెడికల్), సీ కవిత (వరంగల్) రూ.౬.౫౦లక్షలు (మెడికల్, గ్రా ట్యూటీ), వీ కృష్ణమాచారి (మెదక్) రూ.౪లక్షలు(గ్యాట్యుటీ), ఎల్ సుజాత(వరంగల్) రూ. ౬౬,౨౯౭(మెడికల్), రాజమౌళి(మహబూబ్‌నగర్) రూ.౨లక్షలు (గ్యాట్యుటీ), సీజీ శివా నందం (మహబూబ్‌న గర్) రూ.౨లక్షలు(గ్యాట్యుటీ), ఓ రామచంద్రయ్య (మహ బూ బ్‌నగర్) రూ.౨లక్షలు(గ్యాట్యు టీ), సీ శృతి(హైదరాబాద్) రూ.లక్ష (మెడికల్), ఎం సు బ్ర హ్మణ్యశర్మ(హైదరాబాద్) రూ. ౫౦వేలు (ఉపనయనం), పీ విజయమ్మ (హైదరాబాద్) రూ. ౩లక్షలు(గ్యాట్యుటీ), ఎం శంకరయ్య(హైదరాబాద్) రూ.౨ లక్షలు (గ్యాట్యు టీ), ఎస్‌కే బాబు (ఖమ్మం) రూ.౪ లక్షలు (గ్యాట్యుటీ) ఉన్నారు.