21-06-2025 02:08:35 AM
రేపు ప్రారంభించనున్న మంత్రి పొన్నం ప్రభాకర్
కరీంనగర్, జూన్20(విజయాక్రాంతి):శాతవాహన విశ్వవిద్యాలయంలో ఎం ఫార్మసీ కోర్సులు ప్రారంభం కానున్నాయి. భవన ని ర్మాణానికి ఆదివారం ఉదయం 9-30 గంటలకు రాష్ట్ర రవాణా , బి సి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ భూమిపూజ చేస్తా రు.. 2025-26 విద్యా సంవత్సరం నుండి ఫా ర్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆమోదంతో కొత్తగా ప్రారంభించబడ్డాయి.
ఫార్మకాలజి, ఫార్మాసుటిక్స్, మరియు ఫార్మాసుటికల్ అ నాలసిస్ విభాగాలలో ఒక్కోదానికి 15 సీట్ల చొప్పున మొత్తం 45 సీట్లు మంజూరు చేస్తు ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ కోర్సులకు ఆమోదం తెలిపింది.2025-26 విద్యా సంవత్సరం నుండి ఈ కోర్సులు ప్రారంభమవుతాయి. శాతవాహన విశ్వవిద్యాలయ పరిధిలోని మానేరు డ్యాం పక్కన ఉన్న విశ్వవిద్యాలయ ఫార్మసీ కళాశాలలో నూతన తరగతి గదుల భవన నిర్మాణం కొరకు ఉప కులపతి ఉమేష్ కుమార్ తో కలసి మంత్రి కార్యక్రమంలో పాల్గొంటారు.
రు. ఫార్మసీ కళాశాలకు ఎం ఫార్మసీ మంజూరు కావడం ఇప్పటికే ఉన్న పాత తరగతి గదుల మరమ్మత్తుల నేపథ్యంలో నూతన తరగతి భవన నిర్మాణం కొరకు పిఎం ఉష నిధుల కింద ఏడు కోట్ల 28 లక్షల వ్యయంతో తరగతి గదుల నిర్మాణాన్ని చేపట్టనున్నారు. దీనితో ఫార్మసి కళాశాలలో తరగతి గదుల కొరత తీరనుంది. అంతేకాకుండా ఫార్మసి కళాశాల ప్రహరీ గోడ కొరకు విశ్వవిద్యాలయ అంతర్గత నిధుల నుండి రెండు కోట్ల 85 లక్షలతో నిర్మాణం చేపట్టనున్నారు.