4 April, 2026 | 2:18 AM

‘ఉద్యోగార్థులకు లైవ్ కార్యక్రమం’

30-06-2024 12:29 AM

హైదరాబాద్, జూన్ 29 (విజయక్రాంతి): కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఉద్యోగ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల కోసం ఆదివారం టీసాట్ చానల్‌లో ప్రత్యేక లైవ్  కార్యక్రమం ఉంటుందని టీసాట్ సీఈవో వేణుగోపాల్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. 2024లో భర్తీ చేసే 17,727 సీజీఎల్ పోస్టులకు సంబంధించి తెలంగాణలో నిరుద్యోగులకు అవగాహన కల్పించేందుకు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట వరకు ప్రత్యేక ప్రసార కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.