11-06-2025 11:38:56 PM
కక్షలతో శాశ్వత పరిష్కారం లభించదు..
లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలి : జిల్లా ఎస్పీ డి జానకి
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): కొట్టుకుంటే ఒక్కరే గెలుస్తారని... అదే రాజీ పడితే ఇద్దరు విజేతలుగా ఉంటారని జిల్లా ఎస్పీ డి జానకి(District SP D Janaki) స్పష్టం చేశారు. నిర్వహిస్తున్న లోక్ అదాలత్ లో భాగంగా రాజీ ద్వారా న్యాయం ఇరువురికి లభిస్తుందన్నారు. చిన్న చిన్న కేసులకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ఈనెల 14న జాతీయ మెగా లోక్ అదాలత్ లో కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కక్షలతో కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయం, డబ్బులు వృథా చేసుకోవద్దని, చిన్న చిన్న కేసుల విషయంలో కోర్టుల నడుమ కక్షలు పెంచుకోకుండా రాజీ మార్గాన్ని అవలంబించాలన్నారు.
ఈ లోక్ అదాలత్లో రాజీ పడ్డ దగిన క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదా కేసులు, ఆస్తి విభజన, కుటుంబపరమైన నిర్వహణ, రోడ్డు ప్రమాదాలు, చిన్న చిన్న దొంగతనాలు, వైవాహిక వివాదాలు, డ్రంక్ అండ్ డ్రైవ్, టౌన్ న్యూసెన్స్, బ్యాంకు రికవరీ, టెలిఫోన్ బిల్లులు, విద్యుత్ చౌర్యం, చెక్ బౌన్స్ కేసులు మొదలైనవన్నీ పరిష్కరించవచ్చునని తెలిపారు. కొట్టుకుంటే ఒకరే గెలుస్తారు, రాజీ పడితే ఇద్దరూ గెలుస్తారు" అనే నానుడిని ఉదహరిస్తూ, ఎలాంటి కక్షలతోనూ శాశ్వత పరిష్కారం సాధ్యం కాదని, రాజీ ద్వారా సత్వర న్యాయం సాధ్యమవుతుందని ఎస్పీ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బంది, కానిస్టేబుళ్లు కోర్టు డ్యూటీలో భాగంగా ఉండి, రాజీ పడదగిన కేసుల్ని గుర్తించి, ఇరుపక్షాలను కౌన్సిలింగ్ ద్వారా రాజీ చేసేందుకు సన్నద్ధం కావాలన్నారు. జుడిషియల్ డిపార్ట్మెంట్ అందిస్తున్న ఈ అవకాశాన్ని ప్రతి బాధితుడు వినియోగించుకుని శాంతియుత పరిష్కారానికి శ్రీకారం చుట్టాలని సూచించారు.