calender_icon.png 5 February, 2026 | 5:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్లమెంట్ చరిత్రలో ఎన్నడూ ఇలా జరగలేదు

05-02-2026 04:13:33 PM

లోక్‌సభకు రావద్దని ప్రధానికి సూచించా: స్పీకర్

న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న పార్లమెంట్ లో ఘటన దురదృష్టకరమని స్పీకర్ ఓం బిర్లా(Lok Sabha Speaker Om Birla) అన్నారు. కాంగ్రెస్ మహిళా ఎంపీల ప్రవర్తనను స్పీకర్ ఖండించారు. పార్లమెంటులో ప్రధానిపై దాడికి ప్రయత్నించారని స్పీకర్ వెల్లడించారు. పార్లమెంట్ చరిత్రలో ఎన్నడూ ఇలా జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానిని ఘెరావ్ చేయడం పట్ల విపక్షాల తీరును స్పీకర్ తప్పుబట్టారు. కాంగ్రెస్ మహిళా ఎంపీలు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించారని స్పీకర్ ఆరోపించారు.

విపక్ష ఎంపీలు సభా మర్యాదలను ఉల్లంఘించారని స్పీకర్ మండిపడ్డారు. విపక్షాల నిరసనల దృష్ట్యా లోక్ సభకు రావద్దని ప్రధానికి సూచించినట్లు స్పీకర్ స్పష్టం చేశారు. సభను వాయిదా వేయడానికి ముందు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఈరోజు మాట్లాడుతూ, "నిన్న సభలో ఏం జరిగిందో దేశం చూసింది. ఎంపీలు సభలో ప్రధాని కుర్చీ వద్దకు ఎలా వెళ్లారో అందరూ చూశారు. ఏదైనా అవాంఛనీయ సంఘటన జరగవచ్చని నాకు సమాచారం అందింది. అలాంటి పరిస్థితి తలెత్తకుండా ఉండేందుకు, ప్రధాని మోదీని సభకు రావద్దని నేను ఆయనకు తెలియజేశాను." అని ఓం బిర్లా పేర్కొన్నారు.