02-06-2025 12:22:16 AM
భద్రాద్రి కొత్తగూడెం జూన్ 1 (విజయ క్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అధికారుల తీరు అం తా మా ఇష్టం అన్నట్లుగా ఉందని ఆరోపణ లు కనబడుతున్నాయి. నచ్చినవారికి నచ్చిన ప్రాంతానికి ఎలాంటి నిబంధనలు పాటించకుండా డిప్యూటేషన్లు నిర్వహిస్తున్నట్లు తెలు స్తోంది. కార్యాలయంలో పనిచేయాల్సిన సీనియర్ అసిస్టెంట్ లను అవసరం లేకు న్నా, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కోరుకున్న డిప్యూటేషన్ చేయడం గమనార్హం.
డీఈవో కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ మోస్ట్ సీనియర్ అసిస్టెంట్ ను బూర్గం పాడు జిహెచ్ఎస్ పాఠశాలకు ప్రధానోపాధ్యాయులు అడగకున్న కృష్ణకుమారి ని డి ప్యూటేషన్ చేసినట్టు తెలుస్తోంది. ఆ పాఠశాలలో ఇప్పటికే ఒక జూనియర్ అసిస్టెంట్, రికార్డు అసిస్టెంట్ పనిచేస్తున్నారు. మరో సీనియర్ అసిస్టెంట్ చైతన్యను ఇల్లందు ఎం ఆర్ సి కి డిప్టేషన్ పై పంపించారు.
ఎమ్మార్సీలో సరిపోను సిబ్బంది ఉన్నప్పటికీ డిఇఓ ఆఫీస్ నుంచి డిప్యూటేషన్ చేయడంలో అం తర్యం ఏమిటో తెలియడం లేదు. డీఈఓ కా ర్యాలయంలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ సత్యనారాయణ ను కూలీలైన పాఠశా లకు డిప్టేషన్ ఇచ్చారు. ఆ పాఠశాలలో అత ని అవసరం లేదని తెలుస్తోంది. రామవరం పాఠశాల జూనియర్ అసిస్టెంట్ మహేష్ను పాఠశాలలో చేరకుండానే ఆఫీస్ కు డిప్యూటేషన్ పై నియమించారు.
ఆఫీసులో గొడవ చేయడంతో మళ్లీ రామవరం పాఠశాలకు పంపడం జరిగిందనీ తెలుస్తోంది. అంతే కా దు డీఈవో కార్యాలయంలో అకౌంట్స్ నిర్వహణ సంవత్సరాల పాటు చేయడం లేదని తెలుస్తోంది. ఒక ఉపాధ్యాయుని నియామకంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సీనియర్ అసిస్టెంట్ కు కేవలం మూడు రోజుల మా త్రమే పనిష్మెంట్ ఇచ్చి తిరిగి విధుల్లోకి తీసుకోవడం నిబంధనల ప్రకారం సీనియర్ అసి స్టెంట్ సర్వీసులు ఆర్జెడి స్థాయి అధికారి పరిధిలో కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అ న్ని తానై డీఈఓ వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇవి కొన్ని మచ్చుతునకలు మాత్ర మే. ఇప్పటికైనా విద్యాశాఖ ఉన్నాతాధికారులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిఈఓ కా ర్యాలయం పై ప్రత్యేక దృష్టి సారించాలని ప లువురు మేధావులు కోరుతున్నారు. ఇది ఇ లా ఉండగా రామవరం పాఠశాలకు డిప్టేష న్ పై వెళ్లిన మహేష్ గత కొన్ని నెలలుగా వి ధులకు హాజరు కాకుండా అప్స్కాండింగ్లో ఉన్నట్టు తెలుస్తోంది.ఈ విషయమై డీఈఓ ఆఫీస్ సూపర్ సురేష్ కుమార్ ను వివరణ కోరగా తాను బదిలీపై ఇక్కడికి రాకమునుపే ఆర్జెడి పర్మిషన్ తో డిప్యూటేషన్ పై వెళ్ళారన్నారు.