18-06-2025 12:08:24 AM
హైదరాబాద్, జూన్ 17 (విజయక్రాంతి): స్థలాల క్రమబద్ధీకరణ స్కీం(ఎల్ఆర్ఎస్) గడువును రాష్ట్రప్రభుత్వం మరోసారి పెం చింది. తాజాగా ఉత్తర్వుల ప్రకారం భూయజమానులు ఈనె 30వ తేదీలోపు ఎల్ఎఆ ర్ఎస్కు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి ఇలం బర్తి ఉత్తర్వులు జారీ చేశారు. 25 శాతం రా యితీని కూడా పొందవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
గత ప్రభుత్వం స్థలాల క్రమబద్ధీకరణ కోసం ఎల్ఆర్ఎస్ స్కీంను అమలు చేసింది. దీంతో సుమారు 25 లక్షల మంది భూయజమానులు ఎల్ఆర్ఎస్కు దరఖా స్తు చేసుకున్నారు. ఇదే స్కీంను ప్రస్తుతం ప్రభుత్వమూ కొనసాగిస్తూ వస్తున్నది. తొలుత మార్చి నెలాఖరు వరకూ గడువు ఇచ్చి, ఆ తర్వాత నెలనెలా గడువు పెంచుకుంటూ వస్తున్నది.
కడపటి ఉత్తర్వు ప్రకారం.. మే 31 వరకే దరఖాస్తు గడువు ఉంది. ఎక్కువ మంది ప్రజలు స్కీంను సద్వినియోగం చేసుకునే వెసులుబాటు కల్పించేందుకు.. తాజా గా సర్కార్ మరోసారి గడువు పెంచింది. స్కీం ప్రారంభించిన నాటి నుంచి ఎల్ఆర్ఎ స్ ద్వారా సర్కార్కు రూ.2వేల కోట్ల మేర ఆదాయం లభించింది. గడువు పెంపుతో మ రో రూ.10వేల కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా.