18-06-2025 12:10:12 AM
కేకేగూడెం వాసులకు ఇంటి స్థలాలు వచ్చేలా న్యాయం చేస్తామని మంత్రి సీతక్క హమీ
ఇచ్చిరాని తెలిపిన మండల కాంగ్రెస్ నాయకులు కేకేగూడెం వాసులు దాడులకు పాల్పడొద్దు
ఏటూరునాగారం,జూన్17(విజయక్రాంతి):పంచాయతీ రాజ్ రాష్ట్ర మంత్రి ధనసరి సీతక్క ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిటమట రఘు ఆధ్వర్యంలో ఏటూరునాగారం మండలంలోని శంకరాజుపల్లి(కెకెగూడెం) వాసులను మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసారు.
ఈ సందర్బంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిటమట రఘు మాట్లాడుతూ అటవీ శాఖ,పోలీస్ శాఖ,కెకెగూడెం వాసులకు నిన్న జరిగిన దాడి ఘటన పై స్పందించి మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్లామని మంత్రి సీతక్క సంబందితపై అధికారుల ద్రుష్టికి తీసుకెళ్తున్నారని తప్పకుండ న్యాయం చేస్తారని హామీ ఇవ్వడం జరిగిందని,దాడులకు పాల్పడకూడదని,శాంతియుతంగా పోరాటం చేపట్టాలని తప్పకుండా ఇంటి స్థలాలు ఇప్పించే విధంగా సీతక్క చూస్తారని తెలిపారు.
ఏదైనా సమస్య ఉంటే శాంతియుతంగా మాట్లాడుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇర్సవడ్ల వెంకన్న,జిల్లా కార్యదర్శి గుడ్ల దేవేందర్, జిల్లా, మండ ల,గ్రామ నాయకులు,మహిళలు,యువజన నాయకులు,అనుబంధ సంఘాల నాయకులు,మాజీ ప్రజప్రతినిధులు,కార్యకర్తలు కాంగ్రెస్ అభిమానులు పాల్గొన్నారు.