01-06-2025 12:00:00 AM
ప్రకృతి ప్రేమికులను అమితంగా ఆకర్షిస్తున్నది లక్నవరం సరస్సు. చుట్టూ కొండలు మధ్యలో నీరు.. వేలాడే వంతెనపై నడక.. పడవల్లో విహారం పర్యాటకులకు మధురానుభూతిని కలిగిస్తున్నది. ఈ దృశ్యాలను ఊహించుకుని ఏ ఐలాండో, ఏ మలేషియా అనుకుంటే పొరపడినట్లే. ఇది ఎక్కడో కాదు.. మన తెలంగాణలోనే, జయశంకర్ జిల్లా గోవిందరావుపేట మండలంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా పేరొందిన లక్నవరం సరస్సు..
వరంగల్ జిల్లా కేంద్రానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. 202 జాతీయ రహదారికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడికి ప్రత్యేక బస్సు సర్వీసులు లేవు. ప్రైవేటు రవాణాలో వెళ్లాల్సిందే.. ఆర్టీసీ బస్సుల్లో, సొంత వాహనాల్లో వచ్చేవా ళ్లు... ములుగు డివిజన్ కేంద్రం దాటిన తర్వాత గోవిందరావుపేట మండలంలోని చల్యాయి గ్రామం వద్దగల బుస్సాపూర్ క్రాస్ నుంచి కుడివైపునకు ౮ కిలోమీటర్లు దూరం ప్రయాణించి లక్నవరం చేరుకోవచ్చు.
వంతెనపై నడక..
లక్నవరం సరస్సుకు వెళ్తే మనసు దోచే ఎన్నో అందా లు ఆకట్టుకుంటాయి. ౧౬౦ మీటర్ల పొడవు ఉన్న వేలాడేవంతెనపై పర్యాటకులు ప్రకృతి అందాలను ఆస్వాది స్తూ తన్మయత్వం పొందుతారు. అలలపై పయనించేందుకు బోటింగ్, భోజన వసతి కోసం రెస్టారెంట్, విశ్రాం తి కోసం కాటేజీలు ఉన్నాయి. కొత్తగా మరో వేలాడే వంతెన కూడా టూరిజం అధికారులు అందుబాటులోకి తీసుకువచ్చారు.
దాంతో రోజు రోజుకు పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది. ప్రకృతి అందాలతో కనువిందు చేస్తున్న ఈ సరస్సు తెలంగాణలోనే ప్రధాన పర్యాటక కేంద్రంగా పేరు తెచ్చుకుంది. ఇక్కడి పరిసరాలు, సరస్సు, మధ్యలోని దీవులు పర్యాటకానికి అనువుగా ఉండటంతో పర్యాటక శాఖ అదనపు హంగులు అద్దింది.
మొదట ఈ సరస్సుపై హరిద్వార్ తరహాలో రాష్ట్రంలో మొట్టమొదటి వేలాడే వంతెనను నిర్మించారు. కాకతీయుల శిల్ప కళా సంపదను తిలకిం చేందుకు వీలుగా దీనిని అమర్చారు. సరస్సులో ఆరు దీవుల ను అందంగా ముస్తాబు చేశారు. సెలవు దినాల్లోనే కాకుండా, మిగతా రోజుల్లో ప్రాంతాన్ని చూసేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు.
చారిత్రక ఆనవాళ్లు
కాకతీయులు చెరువులు నిర్మించిన ప్రతిచోట ఆలయ నిర్మాణాలు చేపట్టినట్లు చరిత్ర చెబుతోంది. కానీ లక్నవరం, పాకాల సరస్సులను మాత్రం వ్యవసాయ కేంద్రాలుగానే భావించినట్లు తెలుస్తోంది. లక్నవరం దగ్గర ఉన్న బుస్సాపూర్ గ్రామంలో అడవుల్లో చిన్న చిన్న గుడులు కట్టారు. రామలింగేశ్వరుడిని ప్రతీష్ఠించిన అనవాళ్లు ఇక్కడ కనిపిస్తాయి. పాడి పంటలు బాగా పండాలని కాకతీయులుఈ నిర్మాణాలు చేపట్టినట్లు తెలుస్తోంది.
బ్లాక్బెర్రీ ఐలాండ్
లక్నవరానికి 12 కి.మీ దూరంలో తాడ్వాయి మండంలోనే దట్టమైన అటవీ ప్రాంతంలో మరో పర్యాటక ప్రదేశం ఉన్నది. అదే బ్లాక్బెర్రీ ఐలాండ్. జలగలంచ వాగు ఒడ్డున ఉన్న ఇసుక తిన్నెలు, నేరేడు చెట్లు, కంక(వెదురు) వనంతో అందంగా అల్లుకున్న ప్రదేశమిది. పూర్తిగా ఎకో ఫ్రెండ్లీగా ఐదెకరాల విస్తీర్ణంలోని ఈ దీవిని అభివృద్ధి చేశారు.
వెదురు కర్రలతో మంచెలు, 50కిపైగా గుడారాలు, ఇసుకలో వాలీబాల్ కర్టు, ఓపెన్ రెస్టారెంట్లు, సెల్ఫీ పాయింట్లను ఏర్పాటు చేశారు. గోవాలో మాదిరిగా లైటింగ్తో సుందరంగా అలకరించారు. అడవి మధ్యలో రాత్రివేళ ఇక్కడ సేదతీరడం పర్యాటకులకు సరికొత్త అనుభూతిని మిగులుస్తుంది. ట్రెక్కింగ్, బర్డ్వాచ్, సఫారీ రైడింగ్ కోసం అటవీ శాఖ ఏర్పాట్లు చేస్తున్నది.