13 March, 2026 | 9:01 AM

అమ్మకానికి లక్నో సూపర్ జెయింట్స్

13-03-2026 12:00 AM

ముంబై, మార్చి 12: ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు కీలక పరిణామం దిశగా అడుగులు పడుతున్నాయి. లక్నో సూపర్ జెయింట్స్‌లో 15 శా తం వాటాను విక్రయించాలని ఆర్పీ-ఎస్జీ గ్రూప్ భావిస్తున్నది. ఓ వైపు ఆర్సీబీ అమ్మకం ప్రక్రియ కొనసాగుతున్న సమయంలోనే ఈ వార్తలు రావడం హాట్ టాపిక్‌గా మారింది.

ఐపీఎల్ 2025 సీజన్‌లో జట్టు ఎదుర్కొన్న ఇబ్బందుల తరువా త సంజీవ్ గోయెం కా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. తుది నిర్ణయం పెట్టుబడిదారులు అందించే వాల్యుయేషన్‌పై ఆధారపడి ఉంటుందని, ఆఫర్లు ఆకర్షణీయంగా లేకుంటే వెనక్కి తగ్గవచ్చునని భావిస్తున్నారు.