calender_icon.png 21 June, 2025 | 11:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామాల సమగ్ర అభివృద్ధికి కృషి మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి

21-06-2025 02:06:52 AM

మానకొండూర్, జూన్20(విజయక్రాంతి):అభివృద్ధి పనులను వేగవంతం చేయడం ద్వారా గ్రామాలను సమగ్రంగా అభివృద్ధి పర్చేందుకు కృషి చేస్తున్నట్టు మాన కొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ క వ్వంపల్లి సత్యనారాయణ చె ప్పారు. శుక్రవారం మానకొండూర్ మండలంలోని ఊటూరు,రంగపేట, లక్ష్మిపూర్ గ్రామాల్లో పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాలనే ఉద్దేశంతో వివిధ శాఖల ద్వారా ని ధులు మంజూరు చేయిస్తున్నట్టు చెప్పారు. చేపట్టిన పనుల్లో జాప్యం జరగకుండా నిర్ణీత గడువులోగా పూర్తి చేయించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను తూచ తప్పకుండా అమలు చేసి తీరుతామని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి స్పష్టం చేశారు.

మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం, 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడకందారులకు ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు వంటి హామీలను ఇప్పటికే అమలు చేసిందని ఆయన గుర్తు చేశారు. ప్రజల నుంచి డిమాండ్ లేనప్పటికీ వారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని దొడ్డు బియ్యానికి బదులు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నదని ఆయన చెప్పారు.

త్వరలో రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా యువతీ యువకులకు రుణాలు ఇప్పించే కార్యక్రమాన్ని చేపడుతుందని ఆయన వివరించారు. ఆ వెనువెంటనే కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్ల మంజూరు ప్రక్రియను ప్రభుత్వం చేపట్టనున్నదని ఆయన చెప్పారు.

పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే 

మానకొండూర్ మండలం ఊటూరు గ్రామంలో జడ్పీ నిధులు రూ.25 లక్షలతో నిర్మించిన సైడ్ డ్రైన్ ను ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి ప్రారంభించారు. అలాగే ఎన్‌ఆర్‌ఈజీఏ నిధులు రూ.75 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును, ఎస్సీ కాలనీలో ఎస్డీఎఫ్ నిధులు రూ.8 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ఆయన ప్రారంభించారు. ప్రారంభిస్తారు. రంగపేట గ్రామంలో ఎన్‌ఆర్‌ఈజీఏ కింద 25 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ఎమ్మెల్యే ప్రారంభించారు.

లక్ష్మీపూర్ గ్రామంలో కోటి 50 లక్షల రూపాయలతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనాన్ని ఆయన ప్రారంభించారు.ఈ కార్యక్రమాల్లో మండల అభివృద్ధి అధికారి వరలక్ష్మి, పంచాయతీరాజ్ డీఈ రవిప్రసాద్, ఏఈ వెంకన్న, మానకొండూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నందగిరి రవీంద్రచారి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మర్రి ఓదెలు యాదవ్, వైస్ చైర్మన్ ఆర్.తిరుమల్ రెడ్డి,

కాంగ్రెస్ పార్టీ నాయకులు తాళ్లపల్లి సంపత్ గౌడ్,ముద్దసాని శ్రీనివాస్ రెడ్డి,ద్యావ శ్రీనివాస్ రెడ్డి, తుమ్మనపల్లి శ్రీనివాసరావు, అల్లూరి శ్రీనాథ్ రెడ్డి, గోపు శ్రీనివాస్ రెడ్డి, రామిడి తిరుపతి, కోండ్ర సురేష్, కనకం అశోక్, బి.సునీల్, ఎడ్ల సతీష్, ఎం.నాగిరెడ్డి,చంద్రారెడ్డి తదితరులుపాల్గొన్నారు.