18 July, 2026 | 8:22 PM

Breaking News

ఎల్నినో ప్రభావంతో రైతులు ఆరుతడి పంటల సాగు వైపు మొగ్గు చూపాలి   •   బీఆర్ఎస్ కార్యకర్త తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే   •   పార్టీ కార్యకర్తలను పట్టించుకోని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ వైఖరి!   •   కేసుల పరిష్కారానికి కృషి జరగాలి   •   ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయండి   •   సూర్యాపేట జిల్లా సృష్టికర్త జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలు   •   అదనపు తరగతి గదులను ప్రారంభించిన ఎమ్మెల్యే   •   ఉపాధ్యాయులకు ట్రాఫిక్, సైబర్ నేరాలపై అవగాహన   •   నాయకత్వం అంటే పదవి కాదు.. బాధ్యత   •   కొల్గూర్ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ విభాగం ప్రారంభం   •  

మా కాళి వాస్తవ కథే

28-11-2024 12:22 AM

టాలీవుడ్‌కు చెందిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి త్వరలో రాబోతున్న ద్విభాషా చిత్రం ‘మా కాళి’. విజయ్ యెలకంటి రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఈ పాన్ -ఇండియా చిత్రాన్ని హిందీలో చిత్రీకరించారు. 2025లో బెంగాలీ, తెలుగు భాషల్లో థియేటర్ల ద్వారా విడుదల చేయనున్నారు. ఇదిలా ఉండగా, ఈ సినిమా వరల్డ్ ప్రీమియర్‌ను ప్రస్తుతం గోవాలో జరుగుతున్న 55వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఐఎఫ్‌ఎఫ్‌ఐ)లో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, బెంగాల్ గవర్నర్ ఆనంద బోస్‌తోపాటు గోవా డీజీపీ అలోక్ కుమార్, చిత్ర దర్శకుడు విజయ్ యెలకంటి, నిర్మాత వందనాప్రసాద్, లీడ్ యాక్టర్ అభిషేక్ సింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రీమియర్ షో ప్రేక్షకులు, ప్రముఖుల నుంచి స్టాండింగ్ ఒవేషన్ అందుకుంది. ప్రీమియర్ షో అనంతరం గోవా సీఎం ‘మా కాళి’ చిత్రం గురించి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. “మా కాళి’ సినిమాను భారతదేశ విభజన, డైరెక్ట్ యాక్షన్ డే ఆధారంగా రూపొందించారు. నిజం చెప్పే ధైర్యం చాలా తక్కువ మందికి ఉంటుంది” అన్నారు.