18 July, 2026 | 8:41 PM

Breaking News

సిద్ధార్థలో స్కూల్ లీడర్స్ ప్రమాణ స్వీకారోత్సవం   •   గ్రామాలకు వెళ్లి ఎల్ నినో పరిస్థితులపై అవగాహన కల్పించాలి   •   గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం   •   ఎల్ నినో ప్రభావం గురించి రైతులకు అవగాహన కల్పించిన ఎంఏఓ   •   మంత్రి గడ్డం వివేక్ ను కలిసిన అఖిలపక్ష నాయకులు   •   మంత్రి గడ్డం వివేక్ ను కలిసిన అఖిలపక్ష నాయకులు   •   ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించండి   •   ఎల్నినో ప్రభావంతో రైతులు ఆరుతడి పంటల సాగు వైపు మొగ్గు చూపాలి   •   బీఆర్ఎస్ కార్యకర్త తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే   •   పార్టీ కార్యకర్తలను పట్టించుకోని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ వైఖరి!   •  

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయండి

18-07-2026 08:07 PM

బోథ్,(విజయక్రాంతి): ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్లను  ఈ నెలాఖరి వరకు పూర్తి చేయాలని సోనాల ఎంపీడీవో రత్నాకర్ రావు కోరారు. శనివారం ఎంపీడీవో కార్యాలయంలో గ్రామాల కార్యదర్శిలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 214 ఇండ్లను నిర్మించాల్సి ఉందని అందులో 100 ఇండ్లను ఈ నెలాఖరు వరకు పూర్తయ్యేలా చూడాలని పేర్కొన్నారు.

ది బిజీ రాంజీ పథకంలో ఫాంపౌంట్స్ కుంటలు మ్యాజిక్ డ్రైవ్ వంటి పనులు పూర్తి చేయాలని సూచించారు. ప్రతి ఇంటికి ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టేలా ప్రోత్సహించాలన్నారు.మరుగుదొడ్లు కమ్యూనిటీ సానిటరీ బాత్రూంలో వివో భవనాలు, గ్రామపంచాయతీ భవనాలు, పాఠశాలల ప్రహరీ గోడలు, అంగన్వాడీ భవనాలు పూర్తి చేయాలని ఆయన పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు మరుగుదొడ్ల పనులు మంజూరి ఐ ఉన్నందున వాటిని లబ్ధిదారులు నిర్మించుకునే విధంగా ప్రోత్సహించాలని కార్యదర్శి లను కోరారు.