అదనపు తరగతి గదులను ప్రారంభించిన ఎమ్మెల్యే
18-07-2026 07:59 PM
కుబీర్,(విజయక్రాంతి): తానూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదలను ఎమ్మెల్యే రామారావు పటేల్ ప్రారంభించారు. (KGBV)లో నాబార్డ్ (NABARD) నిధులతో నిర్మించిన మొదటి అంతస్తులోని అదనపు తరగతి గదులు మరియు అదనపు మౌలిక సదుపాయాలను కల్పించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా రూ.56 లక్షల వ్యయంతో నిర్మించిన అదనపు తరగతి గదులను, అలాగే రూ.42.12 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన అదనపు మౌలిక సదుపాయాలను ప్రారంభించారు. విద్యార్థినులకు యూనిఫామ్ పంపిణీ చేశారు, విద్యార్థినులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు ఈ అభివృద్ధి పనులు ఎంతో ఉపయోగపడతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.






