18 July, 2026 | 8:34 PM

Breaking News

గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం   •   ఎల్ నినో ప్రభావం గురించి రైతులకు అవగాహన కల్పించిన ఎంఏఓ   •   మంత్రి గడ్డం వివేక్ ను కలిసిన అఖిలపక్ష నాయకులు   •   మంత్రి గడ్డం వివేక్ ను కలిసిన అఖిలపక్ష నాయకులు   •   ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించండి   •   ఎల్నినో ప్రభావంతో రైతులు ఆరుతడి పంటల సాగు వైపు మొగ్గు చూపాలి   •   బీఆర్ఎస్ కార్యకర్త తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే   •   పార్టీ కార్యకర్తలను పట్టించుకోని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ వైఖరి!   •   కేసుల పరిష్కారానికి కృషి జరగాలి   •   ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయండి   •  

ఉపాధ్యాయులకు ట్రాఫిక్, సైబర్ నేరాలపై అవగాహన

18-07-2026 07:56 PM

గజ్వేల్: సమగ్ర శిక్ష అభియాన్ కోర్స్ డైరెక్టర్ పి.అంజి రెడ్డి ఆధ్వర్యంలో ప్రజ్ఞాపూర్ జెడ్పీహెచ్‌ఎస్‌లో ఇన్-సర్వీస్ శిక్షణ పొందుతున్న ఉపాధ్యాయులకు ట్రాఫిక్, సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ ఇన్‌స్పెక్టర్ రవికుమార్, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ డి. సత్యనారాయణ పాల్గొని రోడ్డు భద్రతా నియమాలు, హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగం, అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, డ్రైవింగ్ సమయంలో మొబైల్ వినియోగం వల్ల కలిగే ప్రమాదాలపై వివరించారు. అలాగే ఆన్‌లైన్, ఓటీపీ, బ్యాంకింగ్, డిజిటల్ అరెస్ట్, సోషల్ మీడియా మోసాల నుంచి అప్రమత్తంగా ఉండే విధానాలను వివరించారు. ఉపాధ్యాయులు చురుకుగా పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.