30-06-2025 12:09:42 AM
సూర్యాపేట, జూన్ 29 (విజయక్రాంతి) : జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలొ పి. సి. మెహలోనోబిస్132వ జయంతి సందర్భంగా 19వ జాతీయ అర్థ గణాంక దినోత్సవ వేడుకలను ముఖ్య ప్రణాళిక అధికారి ఎల్. కిషన్ అధ్యక్షతన ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ మెహలోనోబిస్ గారి చిత్ర పటానికి పూలమాల వేసి, నివాళి అర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ మెహలనోబిస్ భారతదేశ మొదటి ప్లానింగ్ కమీషన్లో సభ్యుడగా పనిచేశారన్నారు. క్షేత్రస్తాయిలో ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించాలని, ఎప్పటికపుడు నూతన సాంకేతిక పద్దతులను నేర్చుకుంటూ, వేగంగా సమాచారాన్ని ఉన్నత అధికారులకు అంధించాలన్నారు.
ఈ కార్యక్రమములో జిల్లా క్రీడా అభివృద్ది అధికారి రామచంద్ర రావు, డివిజన్ పంచాయత్ అధికారి నారాయణ రెడ్డి గణాంక అధికారి పి. రమేష్, రిటైర్డ్ సి. పి.వో ఎస్.సి.ఎస్.రాజు, ఉపగణాంక అధికారులు రాజేష్, కోటేశ్వర రావు, రామారావు తదితరులు పాల్గొన్నారు.