మహాత్మ బసవేశ్వరుడి బోధనలు స్ఫూర్తిదాయకం
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
రామచంద్రాపురం, ఏప్రిల్ 20 : సమాజంలో అంటరానితనం, వివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన మహోన్నత వ్యక్తి మహాత్మా బసవేశ్వరుడని, ఆయన సూచించిన విధానం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మహాత్మ బసవేశ్వరుడి 893వ జయంతిని పురస్కరించుకొని రామచంద్రపురం డివిజన్ పరిధిలోని బీరంగూడ చౌరస్తాలో గల అశ్వారుడ బసవేశ్వరుడి విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ 12వ శతాబ్దంలోనే కులం మతం వర్ణ వివక్షత మనుషులందరూ సమానమేనని చాటిచెప్పిన బసవేశ్వరుడని కొనియాడారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ట్యాంకు బండ్ పైన బసవేశ్వరుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారని, అదే స్ఫూర్తితో బీరంగూడలో 12 అడుగుల అశ్వారుడ బసవేశ్వరుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వీరశైన లింగాయత్ సమాజం నియోజకవర్గం అధ్యక్షులు జగదీష్, సమాజం ప్రతినిధులు పాల్గొన్నారు.






