ఓటమి గెలుపునకు నాంది
కామారెడ్డి, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): ఓటమి గెలుపుకు నాంది అని క్రీడా నైపుణ్యత పెంచుకోవడానికి మానసిక ఆలోచనను ప్రేరేపిస్తుందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు అబ్రబోయిన స్వామి అన్నారు గత మూడు రోజులుగా కామారెడ్డి జిల్లా దోమకొండ మండల స్థాయిలో జరిగిన క్రికెట్ టోర్నీలో విజేతలుగా నిలిచిన వారికి స్పాన్డర్ చేసి బహుమతులు సోమవారం అందజేశారు.
విన్నర్ గా దోమకొండకు చెందిన ఛాంపియన్ టీం అలాగే దోమకొండకు చెందిన వారియర్ టీం రన్నర్ గా విజయం సాధించాయి ఈ టోర్నీలో మొత్తం పది టీంలు పాల్గొనగా నిర్వాహకులు మహేష్ సుమంత్ వంశీ టీమ్లకు కావలసిన ప్రోత్సాహకాలు అందించారు ఈ కార్యక్రమంలో ముత్యంపేట్ సర్పంచ్ ఆశ బోయిన అక్షర శ్రీనివాస్ మాజీ మార్కెట్ చైర్మన్ కుంచాల శేఖర్ అబ్రబోయిన రాజు అంకత్ నర్సింలు హరీష్ తదితరులు పాల్గొన్నారు.






