28 June, 2026 | 2:13 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

మహాత్మాగాంధీ ముని మనవరాలి కన్నుమూత

02-04-2025 10:24 AM

నవ్‌సరి,(విజయక్రాంతి): మహాత్మా గాంధీ ముని మనవరాలు నీలంబెన్ పరీఖ్(93) మంగళవారం నవ్‌సరిలో తుదిశ్వాస విడిచారు. మహాత్మా గాంధీ కుమారుడు హరిదాస్ గాంధీ మనవరాలి కుమార్తె అయిన నీలంబెన్ తన కుమారుడు డాక్టర్ సమీర్ పారిఖ్‌తో కలిసి నవ్‌సరి జిల్లాలో నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె నిన్న నవ్‌సిరిలో కన్నుమూశారు. బుధవారం ఉదయం 8 గంటలకు ఆమె నివాసం నుండి ఆమె అంత్యక్రియల ఊరేగింపు జరిపించి, వీర్వాల్ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. నీలాంబెన్ గాంధేయ భావజాలాన్ని విశ్వసించిందని, ఆమె మహాత్మాగాంధీ బాటలోనే తన జీవితాన్ని వ్యారా (సేవ) కు అంకితం చేశారు. తన జీవితాంతం మహిళా సంక్షేమం, మానవ సంక్షేమానికి కృషి కోసం పనిచేశారు.