calender_icon.png 7 June, 2025 | 11:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధిని విధ్వంసం చేసే చరిత్ర మహేశ్వర్‌రెడ్డిది

04-06-2025 12:00:00 AM

మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

నిర్మల్, జూన్ 3(విజయక్రాంతి): రైతులు మత్స్య కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని తాను ఎంతో కష్టపడి చెక్ డ్యాములు నిర్మిస్తే నిర్మల్ ఎమ్మెల్యేగా గెలిచిన మహేశ్వర్‌రెడ్డి వాటిని విధ్వంసం చేసి చరిత్ర హీనులుగా మిగిలిపోతున్నారని మాజీ మం త్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మంగళవారం సోన్ మండలంలోని సాకేర గ్రామం వద్ద స్వర్ణ వాగుపై ప్రభుత్వం ద్వారా నిర్మించిన స్వర్ణ వాగుపై నిర్మించిన కూల్చివేత ప్రదేశా న్ని రైతులతో కలిసి సందర్శించారు.

చెక్ డాంలను కూల్చే అధికారం ఇచ్చిన అధికారులపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని త్వరలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖ అధికారులను కలిసి విన్నవించనున్నట్లు తెలిపారు. అప్పటి ఇంజనీర్లు ప్రణాళిక ప్రకారం నిర్మాణం చేశారని ఆయన వివరించారు.