04-06-2025 12:00:00 AM
అవగాహన ర్యాలీలో ఎమ్మెల్యే పాయల్ శంకర్
అదిలాబాద్, జూన్ 3 (విజయక్రాంతి): భారతదేశంలో పుట్టిన యోగాను నేడు ప్రపంచ దేశాలు అనుసరిస్తున్నాయని ఎమ్మె ల్యే పాయల్ శంకర్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాలలో భాగంగా మంగళవారం ఆయుష్ ఆధ్వర్యంలో యోగ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రిమ్స్ ఆసుపత్రి నుండి పట్టణ పురవీధుల్లో సాగిన ర్యాలీలో రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ తో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు.
ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడు తూ యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకుంటే అనేక లాభాలు ఉన్నాయని అన్నారు. యోగా ప్రాధాన్యతపై ప్రజలకు విస్తృత అవగాహనా కల్పించాలని సూచించారు.ఈ ర్యాలీలో బీజేపీ నాయకులు ఆకుల ప్రవీణ్, రత్నాకర్ రెడ్డి, జోగు రవి, స్వామి రెడ్డి, ఆయు ష్ సిబ్బంది, నర్సింగ్ విద్యార్థులు, మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.