calender_icon.png 6 June, 2025 | 11:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువ వికాసం.. అందని ప్రతిఫలం

04-06-2025 12:00:00 AM

  1. సాంకేతిక కారణాలతో తాత్కాలికంగా వాయిదా 

రాష్ట్ర ప్రభుత్వం చెప్పేదొకటి ..

చేసేది మరొకటని విమర్శలు

యువత ఆశలపై నీళ్లు 

జిల్లాలో రాజీవ్ యువ వికాసం పథకానికి భారీగా దరఖాస్తులు

రాజకీయ పార్టీలు, నేతలు నుంచి సైతం  విమర్శలు

నిర్మల్, జూన్ 3 (విజయక్రాంతి): రాష్ట్రం లో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిం చాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తామన్న రాజీవ్ యువ వికాసం పథకం ఆరంభంలోనే యువత ఆశల పల్లకిపై నీళ్లు చెల్లింది. తెలంగాణ ప్రభుత్వం జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజీవ్ యువ వికాసం పథకం  కింద దరఖాస్తు చేసుకున్న యువతకు సబ్సి డీ రుణాలను మంజూరు చేస్తామని హామీ ఇచ్చి చివరి క్షణంలో వాయిదా వేయడంతో జిల్లాలో యువతలో నిరాశ నెలకొంది. 

ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నిరుద్యోగ యువ తకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రభు త్వం రాజీవ్ యువ వికాసం పథకం కింద దరఖాస్తులను ఆన్లైన్లో తీసుకుంది. ఇందుకు బడ్జెట్ కూడా కేటాయిస్తున్నట్టు ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క పదే పదే ప్రకటించడం ప్రభుత్వం కూడా రుణాల పంపిణీ వేగంగా చర్యలు తీసుకుంటున్నట్టు ప్రచారం చేసుకుంది.

వివిధ యూనిట్ల కింద ఒక్కొక్కరికి రూ.50 వేల నుంచి రూ.4 లక్షల వరకు 4 కేటగిరీలో రాజీవ్ యువ వికాసం పథకం కింద దరఖా స్తులను స్వీకరించిన సంగతి తెలిసిందే. ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు రాక గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగ యువతకు ఈ పథకం ఆస రాగా ఉంటుందని ప్రభుత్వం భావించి ఆర్భాటంగా ప్రచారం చేసిన చివరి క్షణంలో.. పథకం అమలుపై ప్రభుత్వం కొంత సమయం పేరుతో జాప్యం చేయడం నిరుద్యోగ యువతలో తీవ అసంతృప్తికి .. అనుమానలకు దారితీస్తుంది. 

భారీగా వచ్చిన దరఖాస్తులు

నిర్మల్ జిల్లాలో రాజీవ్ యువ వికాసం పథకానికి ప్రభుత్వం ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరించగా జిల్లా వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నిరుద్యోగ యువకులు పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో రూ.50,000 రుణంపై 100% సబ్సిడీ.. రూ. లక్ష రుణంపై 20% సబ్సిడీ ఇస్తామని తెలిపింది. ఆపైన రుణానికి బ్యాంకు గ్యారం టీ కింద నాలుగు లక్షల వరకు రుణాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

జిల్లాలో ఎస్సీ కేటగిరీలో 7346, ఎస్టీ కేటగిరిలో 3627, బీసీ కేటగిరిలో 17,524. ఈబీసీ కేటగిరిలో 426, మైనార్టీ కేటగిరిలో 6056, క్రైస్తవ మైనార్టీ కేటగిరీలో 69 మంది దరఖాస్తు చేసుకున్నట్టు అధికారులు తెలిపా రు. ఈ దరఖాస్తులను ఆయా మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించి బ్యాంకులో ఉన్న సిబిల్ స్కోర్ ఆధారంగా రాజీవ్ యువ వికాస పథకానికి అర్హుల ఎంపిక జాబితాను సిద్ధం చేశారు.

లెక్టర్ అభిలాష అభినవ్, అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్, బీసీ మైనార్టీ సంక్షేమ శాఖల అధికా రులు శ్రీనివాస్ మోహన్ సింగ్ లీడ్ బ్యాంకు మేనేజర్ ఆధ్వర్యంలో కసరత్తు నిర్వహించి మొదటి విడత కింద కొందరికి రుణాలు ఇవ్వాలని నిర్ణయించారు. జిల్లాలో మొదటి విడత కింద ఎస్సీలకు 2894. ఎస్టీలకు 23 25, మైనార్టీలకు 1072. బీసీలకు 4716 మందిని ఎంపిక చేసి జూన్ 2న లక్ష రూపాయల లోపు రుణాలు ఉన్న వారం దరికీ అర్హత మంజూరు పత్రాలను ఇస్తామని ప్రభుత్వ స్పష్టంగా చెప్పి..

చివరి క్షణంలో సాంకేతిక కారణాలతో రుణ సాయాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం నిరుద్యోగ యువ తకు నిరాశకు గురిచేసింది. గతంలో ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాల విషయాల్లో కూడా ఇటువంటి ధోరణి అవలంబి స్తుండగా రాజీవ్ యువ వికాస పథకంపై కూడా ప్రభుత్వం తాత్కాలికంగా వెనక్కి తగ్గడపై నిరుద్యోగ యువత యువకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చెప్పేదొకటి.. చేసేది మరొకటిగా ఉందని రాజకీయ పార్టీల నేతలు సైతం ఈ పథకం అమలు జాప్యంపై విమర్శలు చేస్తున్నారు. 

ప్రభుత్వం ఆర్థిక లోటుతో ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా పదే పదే చెప్తున్న తరుణంలో యువ వికాసానికి నిధుల కొరత లేదని ప్రభుత్వం చెప్పడంతో దరఖాస్తు చేసుకున్న యువకులు సబ్సిడీ రుణాలు వస్తాయని ఆశతో ఎదురుచూస్తు న్నప్పటికీ చివరికి ప్రభుత్వం నిరాశనే కలిగించడంతో ఈ పథకం అమలుపై ప్రజ ల్లో తీవ్ర చర్చ జరుగుతుంది ఇప్పటికైనా ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకంపై స్పష్టత ఇచ్చి నిరుద్యోగ యువతకు భరోసా కల్పించాలని ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీ నాయకులు ప్రజలు కోరుకుంటున్నారు.