దోహా: భారత మహిళా షూటర్ మహేశ్వరీ చౌహాన్ పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించింది. దోహా వేదికగా ఆదివారం జరిగిన షాట్గన్ ఒలింపిక్ క్వాలిఫికేషన్ చాంపియన్షిప్లో రజతం గెలవడం ద్వారా పారిస్ బెర్త్ ఖరారు చేసుకుంది. షాట్గన్ ఈవెంట్లో మహేశ్వరీ 125 పాయింట్లకు గాను 121 స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచింది. ఇక భారత్ నుంచి ఇప్పటివరకు 21 మంది షూటర్లు పారిస్ ఒలింపిక్స్ కోటా సాధించారు.