అకాల వర్షంతో మొక్కజొన్న పంట నష్టం
24-03-2026 09:59 PM
సదాశివనగర్,(విజయక్రాంతి): మండలంలోని పద్మాజీవాడి, ముందేగాం గ్రామాల్లో మంగళవారం అకాల వర్షం కురవడంతో అన్నదాతలకు తీవ్ర నష్టం వాటిలింది. పద్మాజీవాడి ముందేగాం శివారులో మొక్క జొన్న పంట గాలి వానకు పూర్తి గా నెలకు ఒరిగింది. చేతికి వచ్చిన పంట నష్ట పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తమను ప్రభుత్వం ఆడుకోవాలని కోరుతున్నారు.




