10-06-2025 05:06:26 PM
నిర్మల్ (విజయక్రాంతి): జిల్లాలో అంగన్వాడీ బడిబాట కార్యక్రమాన్ని ఈరోజు నుంచి నిర్వహిస్తున్నట్టు జిల్లా ఇన్చార్జి అధికారి నాగమణి(District In-Charge Officer Nagamani) తెలిపారు. శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని 936 అంగన్వాడి కేంద్రాల్లో బడిబాట నిర్వహించి మూడు సంవత్సరలోపు పిల్లలందరినీ అంగన్వాడీలో చేర్చాలని కోరారు. ఇప్పటికీ జిల్లాలో అన్ని అంగన్వాడి కేంద్రాల్లో సమావేశాలు నిర్వహించి అంగన్వాడీ బడిబాట యొక్క ప్రాధాన్యతను ప్రతి ఒక్కరికి వివరించడం జరిగిందని ప్రతి ఒక్కరు కూడా అంగన్వాడిలో పిల్లలు చేర్చే విధంగా తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు.