17 April, 2026 | 3:16 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

చలో గావ్ అభియాన్ బస్తీ చలో అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి

09-04-2025 06:00 PM

భాజపా జిల్లా జనరల్ సెక్రెటరీ - పసుమర్తి సతీష్..

చర్ల (విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ చర్ల మండల కార్యాలయం నందు మండల అధ్యక్షులు నూప రమేష్ ఆధ్వర్యంలో బుధవారం క్రియాశీల సభ్యుల సమావేశాన్నీ ఏర్పాటు  జరిగినది, ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా జనరల్ సెక్రటరీ పసుమర్తి సతీష్ హాజరై మాట్లాడుతూ..  ఏప్రిల్ 10, 11, 12 తేదీలలో చలోగావ్ అభియాన్ బస్తి చలో అభియాన్ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో నిర్వహించాలన్నారు.

ఈ తేదీలలో గ్రామాలలో మండల క్రియాశీల సభ్యులు తప్పకుండా పర్యటించాలని, అనంతరం14 తారీఖున చర్ల మండల కేంద్రంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు నిర్వహించాలన్నారు. పార్టీ సభ్యులు పార్టీని బలోపేతం చేసే ఎలాంటి కార్యక్రమాలలో క్రియాశీల పాత్ర పోషించాలన్నారు. ఈ సమావేశంలో కిసాన్ మోర్చా అధ్యక్షులు ఇర్ప సుబ్బారావు, సీనియర్ నాయకులు శ్రీనివాస చారి, బంధా మధు, బత్తుల వెంకటేశ్వర్లు, విశ్వనాధం, ముత్తారపు రత్తయ్య, మల్లెల ప్రశాంత్, గోపాల సాయి, కుప్ప మాధవరావు, కూరం రమేష్ తదితరులు పాల్గొన్నారు.