17-06-2025 04:59:59 PM
సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి సత్యనారాయణ..
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): భారతీయ కమ్యూనిస్టు పార్టీ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి బద్రి సత్యనారాయణ(CPI Party District Secretary Satyanarayana) పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 20న జిల్లా కేంద్రంలోని తిరుమలలో నిర్వహిస్తున్న మహాసభలకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కునంనేని సాంబశివరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేని శంకర్ హాజరుతున్నట్లు తెలిపారు.
మాహా సభలకు జిల్లాలోని కమ్యూనిస్టులు, పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు అధిక సంఖ్యలో హాజరు అయ్యి విజయవంతం చేయాలని కోరారు. జిల్లా కౌన్సిల్ సభ్యులు సకాలంలో హాజరుకావాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు తిరుపతి, నరసయ్య, ఆత్మకూరి చిరంజీవి, సీతారాం తదితరులు పాల్గొన్నారు.