01-06-2025 06:27:02 PM
పెన్ పహాడ్: దీర్ఘకాలం నుంచి రైతులకు సంబంధించిన భూ సమస్యలు, భూ రికార్డులు, రైతులకు భూమిపై హక్కులను భద్రపరిచే దిశగా తెలంగాణ ప్రభుత్వం భూభారతి పేరుతో రెవిన్యూ సదస్సులను నిర్వహిస్తున్నట్లు తహసిల్దార్ లాలునాయక్(Tehsildar Lalu Nayak) తెలిపారు. ఈనెల 3 నుంచి 12 వరకు సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలంలోని ఆయా గ్రామాలలో భూభారతి పై రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు ఈ అవకాశం రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
గ్రామాల వారిగా షెడ్యూల్ ఇదే...
ఈనెల 3న మంగళవారం మాచారం, నాగుల పహాడ్ 4న లింగాల, అనాజిపురం, రాజుపేట, 5న మహమ్మదాపురం, పొట్ల పహాడ్, 6న ధర్మపురం, దోస పహాడ్, 9న భక్తళాపురం, సింగారెడ్డి పాలెం, 10న గాజుల మల్కాపురం, పెన్ పహాడ్, 11న చీదెళ్ల, అనంతారం, 12న దూపాడు, ఎన్ అన్నారం గ్రామాలలో భూభారతిపై రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నారు.