calender_icon.png 28 September, 2025 | 9:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిమిషాంబ అమ్మవారిని దర్శించుకున్న మల్లారెడ్డి

28-09-2025 08:22:10 PM

మేడిపల్లి (విజయక్రాంతి): మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బోడుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని నిమిషాంబ దేవాలయంలో దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి అమ్మవారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బోడుప్పల్ బిఆర్ఎస్ అధ్యక్షులు మంద సంజీవరెడ్డి ఏర్పాటుచేసిన అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొని భక్తులకు వడ్డించి భక్తులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, బిఆర్ఎస్ పార్టీ ఎలాంటి ఎన్నికలు వచ్చినా ఖచ్చితంగా గెలవాలని, అమ్మవారిని వేడుకున్నట్లు మల్లారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పిజ్జాదిగూడ, బోడుప్పల్, మాజీ మేయర్లు జక్క వెంకట్ రెడ్డి, సామల బుచ్చిరెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మి రవి గౌడ్, మాజీ కార్పొరేటర్ ఎన్ మధుసూదన్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.