హెలికాఫ్టర్ ఎక్కి కూర్చోబోతుండగా ఘటన
కోల్కత్తా, ఏప్రిల్ 27: తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా శనివారం హెల్కాప్టర్ ఎక్కి కుర్చీలో కూర్చోబోతూ కిందపడి స్వల్పంగా గాయప డ్డారు. ఈ ఘటన దుర్గాపూర్ ఎన్నికల ప్రచారంలో జరిగింది. వెంటనే భద్రతా సిబ్బంది ఆమెకు ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం ఆమె అసన్సోల్ ఎన్నికల ప్రచారానికి బయల్దేరివెళ్లారు. మే నెలలోనూ కోల్కత్తాలోని ఆమె నివాసంలో జారిపడ్డారు. ఘటనలో ఆమె నుదుటిపైన లోతైన గాయమైంది. 2023 జూన్లోనూ ప్రతికూల వాతావరణంలో సిలిగురిలో హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ అవుతుండగా ఆమె తీవ్రంగా గాయపడ్డారు. ఘటనలో ఆమె ఎడమ మోకీలుకు బలమైన గాయమైంది.