వేధింపులు తాళలేక కొడుకు హత్య

27-04-2024 01:38:59 AM

కరీంనగర్, ఏప్రిల్ 26:  తాగుడికి బాని సైన కొడుకుని ఓ తండ్రి హత్యచేసిన ఘటన కొత్తపల్లిలో శుక్రవారం వెలుగుచూసింది. గ్రామా నికి చెందిన పెరుమాండ్ల శివసాయి (23) డెకరెషన్స్ పనికి వెళ్తుంటాడు. కొద్దిరో జులుగా శివసాయి మద్యానికి బానిసై తల్లి దండ్రులను ఇబ్బంది పెడుతున్నాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి మద్యం తాగి వచ్చిన కుమారుడిపై తండ్రి శ్రీనివాస్ దాడి చేశాడు. ఘటనలో శివసాయి తీవ్రగాయా లపాలై మృతిచెందాడు. అనంతరం శ్రీనివాస్ పోలీసులకు లొంగిపోయాడు.