రెండు బైకులు ఢీ.. ముగ్గురి దుర్మరణం

27-04-2024 01:41:18 AM

కుమ్రంభీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): ఎదురెదురుగా రెండు బైకు లు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు దుర్మ రణం చెందారు.  ఈ ఘటన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జుర్ మండలంలో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మం డలంలోని పోతపల్లి కోర్తగూడ ప్రధాన రోడ్డుపై రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో బెజ్జూర్ మండ లం ఎలుకపెల్లికి  చెందిన దున్న సరసిం హులు (20), అర్కగూడేనికి చెందిన ఆత్రం మహేశ్ (26), బారేగూడేనికి చెందిన తొర్రె వెంగళరావు (30) అక్కడిక్కడే మృతి చెందా రు. మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యా యి. క్షతగాత్రులను కాగజ్‌నగర్ దవాఖానకు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.