కుటుంబ కలహాలతో భర్తను చంపిన భార్య

27-04-2024 01:36:13 AM

నిజామాబాద్, ఏప్రిల్ 26 (విజయక్రాం తి): నిజామాబాద్ జిల్లాలోని మోపాల్ మండలం కులాస్‌పూర్‌లో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో భర్తను చంపింది ఓ భార్య. కులాస్‌పూర్‌కు చెందిన సాయిరెడ్డి(55), భార్య రాధ మధ్య కొంతకాలంగా కలహాలు చోటుచేసుకుం టున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి సాయిరెడ్డి ఇంట్లో నిద్రిస్తున్న సమ యంలో భార్య రాధ దిండుతో అతని మొహంపై అదిమిపట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేసింది. పోలీసులు శుక్రవారం సంఘ టన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వా స్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.