calender_icon.png 7 June, 2025 | 9:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

షార్ట్ సర్క్యూట్ తో మంటలు అంటుకొని వ్యక్తి సజీవ దహనం

07-06-2025 03:03:24 PM

కుత్బుల్లాపూర్,(విజయక్రాంతి): షార్ట్ సర్క్యూట్ తో మంటలు అంటుకొని ఓ వ్యక్తి సజీవ దహనం అయిన సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధి రింగుబస్తీలోని సాయి(27) అనే యువకుడు తల్లిదండ్రులతో కలిసి ఓ ఇంట్లో నివసిస్తున్నాడు. శనివారం ఉదయం తల్లితండ్రులు గుడికి వెళ్లారు.తిరిగి ఇంటికి వచ్చి చూసేసరికి రూమ్ అంతా పొగలతో కాలిపోయి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు. కరెంటు షార్ట్ సర్క్యూట్ తో మంటలు అంటుకొని సాయి అక్కడికక్కడే చనిపోయాడు. ఫైర్ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.సెల్ ఫోన్ చార్జింగ్ పెట్టి మాట్లాడుతున్న క్రమంలో మొబైల్ పేలి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం గాంధీ హాస్పిటల్ కి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.