calender_icon.png 7 June, 2025 | 11:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇకనైనా ప్రభుత్వం మేల్కోవాలి

07-06-2025 03:10:02 PM

బైంసా,(విజయక్రాంతి): ముధోల్ నియోజకవర్గంలోని శిథిలావస్థ కు చేరిన పాఠశాల భవనాలను వెంటనే తొలగించాలని వాటి స్థానంలో నూతన భవనాలను నిర్మించాలని ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ డిమాండ్ చేశారు. కుబీర్ మండలం అంతర్నీలో శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనం కూలి అక్కడ ఆడుకుంటున్న ముగ్గురు బాలురకు తీవ్ర గాయాలపాలెం భైంసా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం విధితమే. ఈ మేరకు శనివారం ఆయన ప్రభుత్వ ఆసుపత్రిలో రాధిక బాలులను పమర్శించారు.

ఒకవైపు ప్రభుత్వం నూతన విద్యా సంవత్సరం సందర్భంగా బడిబాటను ప్రారంభించగా అంతర్నీలో శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనం కూలిపోయింది అన్నారు. అందులో ఆడుకుంటున్న బాలురు గాయాల పాలు కావడం దురదృష్టకరమన్నారు. ఇటువంటి పాఠశాల భవనాలను అధికారులు ముందస్తుగా గుర్తించకపోవడం ప్రభుత్వ వైఫల్యమే అని విమర్శించారు. బాధ్యులైన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తీరుకొని అవసరమైన చోట నూతన పాఠశాల భవనాలను నిర్మాణం చేపట్టి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య రక్షణ కల్పించాలని కోరారు.