calender_icon.png 25 June, 2025 | 9:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్థిక సమస్యలతో ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య

11-06-2025 12:24:20 AM

ఘట్ కేసర్, జూన్ 10 (విజయక్రాంతి) : ఆర్థిక సమస్యలతో ఓ వ్యక్తి జీవితం పై విరక్తి చెంది ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఘట్ కేసర్ బ్రూక్ బాండ్ కాలనీకి చెందిన గుంట రమేష్ (39) బోడుప్పల్ లోని లైఫ్ స్ప్రింగ్ హాస్పిటల్ లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు.

సోమవారం రాత్రి 9గంటల సమయంలో గుంట రమేష్  తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకున్నాడు. గుర్తించిన కుటుంబ సభ్యులు చుట్టుప్రక్క వారి సహాయంతో డోర్ పగలగొట్టి తెరిచి, క్రిందకు దింపి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని వెళ్లారు.

అక్కడి డాక్టర్స్ అప్పటికే రమేష్ చనిపోయినట్లు ధ్రువీకరించారు. ఇతని మరణానికి ఆర్థిక సమస్యలే కారణమని తెలుస్తుందని పోలీసులు తెలిపారు. మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుగుతున్నట్లు ఎస్‌ఐ ప్రభాకర్ రెడ్డి తెలిపారు.