calender_icon.png 25 June, 2025 | 2:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

11 ఏళ్లకు చేరిన మోదీ ప్రభుత్వం

11-06-2025 12:24:26 AM

గోపాలపేట జూన్ 10: ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రభుత్వం నేటికీ 11 ఏళ్లు దాటిందని మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ లోకనాథ్ రెడ్డి అన్నారు. బిజెపి ప్రభుత్వం 11 ఏళ్లకు చేరిన సందర్భంగా మంగళవారం గోపాలపేట మండల కేంద్రంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... మోడీ ప్రభుత్వం 11 ఏళ్లకు చేరిన సందర్భంగా ఈనెల 14న గోపాలపేటలోని పద్మావతి గార్డెన్ లో ఏర్పాటు చేస్తున్న బిజెపి సమావేశానికి మహబూబ్ నగర్ భారతీయ జనతా పార్టీ ఎంపీ డి కే అరుణ హాజరు అవుతున్నట్లు ఆయన తెలిపారు. అంతకుముందు నూతనంగా ఏర్పడ్డ మండల కార్యవర్గ సభ్యులను సన్మానించారు.

కార్యక్రమంలో గోపాల్పేట బిజెపి మండల అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యుడు నారాయణ యాదవ్ మాజీ మండల అధ్యక్షులు అరవింద్ రెడ్డి మల్లికార్జున్ నారాయణ శ్రీశైలం శివ నాగరాజు సురేష్ గౌడ్ అనురాగ్ దామోదర్ తదితరులు పాల్గొన్నారు.