11-06-2025 12:22:51 AM
వృద్ధ దంపతుల హత్య కేసు వివరాలు వెల్లడించిన డిసిపి సిహెచ్ శ్రీనివాస్
రాజేంద్రనగర్ జూన్ 10: ఇటీవల రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఉప్పర్పల్లి జన చైతన్య పేస్-2లో సంచలనం సృష్టించిన డబుల్ మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. మాజీ డ్రైవరే హత్య చేసినట్లు నిర్ధారించారు. ఈ కేసు వివరాలను మంగళవారం రాజేంద్రనగర్ లోని తన కార్యాలయంలో డీసీపీ చింతమనేని శ్రీనివాస్ మీడియాకు వెల్లడించారు.
నగరంలోని రెడ్ హిల్స్ ప్రాంతంలో షేక్ అబుల్లా (70) రిటైర్డ్ బ్యాక్ ఉద్యోగి, రఫాయి రిజ్వానా (65) దంపతులు నివాసం ఉంటున్నారు. అబ్దుల్లా రిటైర్డ్ ఎస్బిఐ ఉన్నతాధికారి. రిజ్వానా రిటైర్ లెక్చరర్. గతంలో వీరి వద్ద మెదక్ జిల్లా సుల్తాన్ పూర్ గ్రామానికి చెందిన మహమ్మద్ షకీల్ సల్మాన్ డ్రైవర్ గా రెండు సంవత్సరాలు పనిచేశాడు. ఆ సమయంలో అబ్దుల్లా అతడిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసేవాడు.
ఈ క్రమంలో 8 నెలల క్రితం అతనిని పనిలో నుంచి తొలగించడంతో నిరుద్యోగిగా మా రడమే కాకుండా అవమానంగా భావించి దంపతులపై కక్ష పెంచుకున్నాడు. డ్రైవర్ మహమ్మద్ షకీల్ సల్మాన్ వారిని చంపేయాలని నిర్ణయించుకొని పక్కా ప్లాన్ రచించాడు. తన స్నేహితుడు అయిన ఎ-2 మహ్మద్ ముజీబుద్దీన్ వద్ద కొన్ని రోజుల క్రితం సల్మాన్ వద్ద రూ.37వేలు తీసుకున్నాడు. ఆ డబ్బులు ఇప్పిస్తానని అతనికి చెప్పి తీసుకొచ్చాడు.
ఈనెల 4న రెడ్ హిల్స్ వెళ్లారు. వృద్ధ దంపతులు అక్కడి నుంచి 40 రోజుల క్రితం జనచైతన్య కాలనీ ఫేజ్-2ను షిఫ్ట్ అయినట్లు తెలుసుకొని మరొకటి రోజు వచ్చారు. సల్మాన్ (33) బురఖా ధరించి, మహ్మద్ ముజీబుద్దీన్ (25) ముసుగు ధరించి అపార్ట్మెంట్ వాచ్మెన్ రాజేష్ థాపాను సంప్రదించి అబ్దుల్లా అనుమతితో పైకి వెళ్లారు.ఇంట్లోకి వెళ్లిన తరువాత మహమ్మద్ షకీల్ సల్మాన్ తన వెంట తెచ్చుకున్న కత్తిని తీసి దంపతులు షేక్ అబ్దుల్లా, రఫాయి రిజ్వానాను అతికిరాతకంగా పొడిచి చంపాడు.
అది చూసిన ఏ2 అక్కడి నుండి పరారయ్యడు.అనంతరం వారు మృతి చెందారని నిర్ధారించుకున్న నిందితుడు అక్కడి నుండి పారిపోయే ముందు అబ్దుల్లా జేబులో ఉన్న రూ.600 దొంగిలించాడని డీసీపీ తెలిపారు.. నిందితులు ఎ1 మహమ్మద్ షకీల్ సల్మాన్ , ఎ 2 మమ్మద్ ముజీబుద్దీన్ లను అరెస్టు చేసి వారి నుంచి ఒక కత్తి, రెండు సెల్ ఫోన్లు, ఒక స్కూటీ, బురఖా, బూట్లు స్వాధీనం చేసుకొని మంగళవారం రిమాండ్ తరలించినట్లు పేర్కొన్నారు.
ఈ కేసును రాజేంద్రనగర్ డివిజన్ లా అండ్ ఆర్డర్ బృందంతో సిసిఎస్ ఎస్ఓటి బృందాల విజయవంతంగా కేసును చేదించినట్లు డీసీపీ తెలిపారు. ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కేసును చేదించిన సిబ్బందిని అభినందించారు.
జాగ్రత్తగా ఉండాలి : ఈ సందర్భంగా డిసిపి పలు సూచనలు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించడానికి ముందు ఎల్లప్పుడూ వారి గుర్తింపును నిర్ధారించాలన్నారు. తలుపు వద్ద ఎవరు ఉన్నారో తనిఖీ చేయాలని చెప్పారు.
భద్రత కెమెరాలను ఉపయోగించాల ని సూచించారు. డ్రైవర్లను నియమించుకునేటప్పుడు వారి వివరాలను క్షుణ్ణంగా తనిఖీ వేయాలని సూచించారు. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ, శ్రాజేంద్రనగర్ ఎసిపి శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ క్యాస్ట్రో తదితరులుపాల్గొన్నారు.