21-05-2025 03:37:11 PM
ఇబ్రహీంపట్నం: అనారోగ్యంతో బాధపడుతూ మనస్థాపం చెందిన వ్యక్తి సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలాపూర్ మండలం నాదార్గుల్ గ్రామ పరిధిలోని కమ్మగూడ స్ఫూర్తి కళాశాల వద్ద నివాసం ఉండే మదను లూర్డు మరియనా (ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్), జోసెఫ్ దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు అవినాష్ (20) ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇతను గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు.
కాగా మంగళవారం డ్యూటీకి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నాడు. తల్లిదండ్రులు పనుల నిమిత్తం బయటకు వెళ్లారు. పెద్ద కుమారుడు ఆకాష్ కోచింగ్ కు వెళ్ళాడు. దింతో తీవ్రమైన కడుపునొప్పి, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అవినాష్ ఇంట్లోని సిలింగ్ ఫ్యాన్ కు చున్ని తో ఊరి వేసుకొని బలవన్మరణానికి పాలపడ్డాడు. కాగా కోచింగ్ వెళ్లిన ఆకాష్ తిరిగి ఇంటికి వచ్చి చూడగా, అవినాష్ ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించాడు. దింతో అతను తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. అప్పటికే అతను మృతి చెందడంతో అతని తల్లి ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.