21 March, 2026 | 3:25 PM

మోటార్ సైకిల్ ను ఢీ కొట్టిన కారు..!

21-03-2026 02:15 PM

కొల్చారం,(విజయక్రాంతి):ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టడంతో ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన కొల్చారం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. మండల కేంద్రంలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన ఒక కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు గన్ పూర్ ఐఎంఎల్ డిపోలో విధులు నిర్వహించే నాగం నగేష్ గా గుర్తించారు. స్థానిక ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.